15 April, 2026 | 12:08 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

బెల్లంపల్లిలో - 84.59 శాతం పోలింగ్

15-12-2025 12:00 AM

బెల్లంపల్లి, డిసెంబర్ 14 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజక వర్గం లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 1,37,382 ఓటర్లకు గాను 116,205 (84.59 శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నా రు. పోలింగ్ నిర్వహణ కోసం బెల్లంపల్లి నియోజక వర్గంలోని ఏడు మండలాల్లో 996 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేశారు.

బెల్లంపల్లి మండలంలో 85.30 శాతం, భీమినీలో 89.90 శాతం, కన్నెపల్లిలో 90.37 శాతం, కాసిపేటలో 78.74 శాతం, నేన్నెలలో 89.08శాతం, తాండూర్‌లో 78.52 శాతం, వేమనపల్లి లో 89.00 శాతం నమోదైంది. ఎన్నికలను పురస్కరించుకొని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ వేమనపల్లి, నెన్నెల మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కుమార్ దీపక్ నియోజవర్గంలోనీ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళినీ అడిగి తెలుసుకున్నారు.