15-12-2025 12:00:00 AM
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్
నస్పూర్, డిసెంబర్ 14 : జిల్లాలో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెం డవ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో భాగంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియను కలెక్టరేట్ లో అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావుతో కలిసి జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ రెండవ విడతలో జిల్లాలోని బెల్లంపల్లి, భీమిని, కన్నేపల్లి, నెన్నెల, కాసిపేట, తాండూర్, వేమనపల్లి మండలాలలో సర్పం చ్, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్, కౌం టింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందన్నారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభా గం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.