2 July, 2026 | 2:37 AM

భరోసా సెంటర్ ప్రారంభం

02-07-2026 01:40 AM

మహిళల రక్షణకు ప్రాధాన్యత

షాద్నగర్, జూలై 1(విజయక్రాంతి):గృహహింస, లైంగిక వేధింపులు మరియు కుటుం బ సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు, బాధితులకు తక్షణ అండగా నిలిచేందు కు ఏర్పాటు చేసిన ’భరోసా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్’ను షాద్నగర్ డీసీపీ శిరీష రాఘవేందర్ బుధవారం ఘనంగా ప్రారంభించారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగ ణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కేం ద్రం ఇకపై బాధితులకు ఒక సంరక్షణ కవచంలా పనిచేయనుంది.

ఈ సందర్భంగా డీసీపీ శిరీషా రాఘవేంద్ర మాట్లాడుతూ, మ హిళలు మరియు బాధితుల భద్రతకు తా ము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్ప ష్టం చేశారు. ఈ భరోసా కేంద్రం ద్వారా చట్టపరమైన సలహాలు, మానసిక పరామర్శ, నిపుణులతో కుటుంబ కౌన్సెలింగ్తో పాటు బాధితులకు అవసరమైన అన్ని రకాల సహా య సేవలను ఒకే చోట (సింగిల్ విండో సిస్ట మ్) అందిస్తామని తెలిపారు.