19-05-2025 12:33:02 AM
మేడ్చల్, మే 18(విజయ క్రాంతి): మేడ్చల్ నియోజకవర్గంలో కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మంజూరైన ప్రోత్సాహకాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అందజేశారు.
అఖిల్ హరిప్రియ, బంగారు అనూష, శరత్ కుమార్ మీనా జంటలకు రూ.2.50 లక్షల బ్యాంకు డిపాజిట్ బాండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారిని టీ తులసి కృష్ణ పాల్గొన్నారు.