calender_icon.png 1 July, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త రైల్వే ఛార్జీలు.. టికెట్ బుకింగ్ లో నిబంధనలు

30-06-2025 07:01:30 PM

న్యూఢిల్లీ: జూలై 1 నుండి మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ తరగతి ఛార్జీలను కిలోమీటరుకు 1 పైసా చొప్పున అన్ని ఏసీ తరగతుల ఛార్జీలను 2 పైసలు పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. జూన్ 24న మంత్రిత్వ శాఖ అధికారులు ముందుగా ప్రతిపాదిత ఛార్జీల సవరణను సూచించిన విషయం తెలిసిందే. అయితే, రైళ్లు తరగతుల వర్గాల ప్రకారం ఛార్జీల పట్టికతో కూడిన అధికారిక సర్క్యులర్ ఇవాళ ప్రకటించింది. రోజువారీ ప్రయాణికుల ప్రయోజనాల దృష్ట్యా సబర్బన్ రైళ్లు, నెలవారీ సీజన్ టిక్కెట్ల ఛార్జీలను మార్చలేదు. 500 కిలోమీటర్ల వరకు  ప్రయాణించే సాధారణ తరగతి ప్రయాణీకులకు, అంతకు మించిన దూరాలకు టికెట్ ధరలలో కిలోమీటర్ కు అర పైసా పెంచింది. జూలై 1 నుండి సాధారణ స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు రైలు ప్రయాణానికి కిమీకు అర పైసా ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పరిమితి దాటితే నామమాత్రపు పెరుగుదల వర్తిస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. 501–1500 కిలో మీటర్లకు రూ.5, 1501–2500 కిలో మీటర్లకు రూ.10, 2501–3000 కిలో మీటర్లకు రూ.15, 

ప్రత్యేకంగా నాన్-ఏసీ ఆర్డినరీ తరగతులకు సవరించిన ప్రతి కిలోమీటరు ఛార్జీ నిర్మాణం నిరాడంబరంగా ఉంది:

సాధారణ నాన్-ఏసీ తరగతులు : కి.మీ.కు 0.5 పైసలు పెరుగుదల

మెయిల్/ఎక్స్‌ప్రెస్ నాన్-ఏసీ తరగతులు : కి.మీ.కు 1 పైసలు పెరుగుదల

అన్ని ఏసీ తరగతులు : కి.మీ.కు 2 పైసలు పెరుగుదల

ముఖ్యంగా, సబర్బన్ టికెట్ ధరలు, సీజన్ పాస్‌లపై ఎలాంటి మార్పు లేకుండా, రోజువారీ ప్రయాణికులకు ప్రాప్యతను కాపాడుతుంది. రాజధాని, శతాబ్ది, దూరంతో, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లు కూడా నవీకరించబడిన నిర్మాణంలో చేర్చబడ్డాయి. ఛార్జీల నవీకరణ అనుబంధ ఛార్జీలను ప్రభావితం చేయదని అధికారులు పేర్కొన్నారు. రిజర్వేషన్ ఫీజులు, సర్‌ఛార్జీలు, జీఎస్టీ(GST) ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉంటాయి. జూలై 1కి ముందు బుక్ చేసుకున్న టిక్కెట్లు ప్రస్తుత ఛార్జీల ప్రకారం చెల్లుబాటు అవుతాయి.