20-11-2025 12:48:40 AM
భీమదేవరపల్లి, నవంబర్ 19 (విజయక్రాంతి)హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేడ్కర్ కూడలిలో బుధవారం దేశ మాజీ ప్రధాని ఇంది రా గాంధీ 108వ జయంతి వేడుకలు ఘనం గా నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిట్టెంపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో ఇంది రా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భం గా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసారు.
ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రిగా ఇందిరమ్మ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. పేద ప్రజలకు అండగా నిలవడంతో పాటు, మహిళా సాధికారిత కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆమె పాలనలో బడుగు, బలహీన వర్గాలకు మేలు జరిగిందని పేర్కొన్నారు. కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయ మాజీ ఛైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా, మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు చిదురాల స్వరూప, పత్తిపాక కొమురెల్లి, జిల్లా నాయకులు పచ్చునూరి కరుణాకర్, వల్లెపు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.