calender_icon.png 19 June, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు

19-06-2025 12:10:14 AM

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

ముసాపేట జూన్ 18 : మండలంకు చెందిన వివిధ గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల 255 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ ఇండ్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని అన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు, మిత్తిలు కట్టుకుంటూనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.

విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి, చిప్ప చేతికిచ్చిన ఇచ్చిన మాట మేరకు ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తున్నామన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 10 లక్షల ఆరోగ్య శ్రీ, 500 లకే సిలిండర్ 2 లక్షల రుణమాఫీ 500 బోనాస్ సన్న బియ్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేసిందన్నారు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల, దౌర్భాగ్య ఎమ్మెల్యే పాలనలో మూసాపేట్ లో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని గత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేసిందని, ఈ ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే అదనంగా 1000 ఇండ్లు మంజూరు అవుతాయని పేర్కొన్నారు ఇల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు.

మొదటి విడతలో ఇల్లు మంజూరైన వారు తక్షణమే తమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకోవాలన్నారు నిర్మాణ దశలను బట్టి సకాలంలో బిల్లులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శెట్టి శేఖర్, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, దేవరకద్ర నియోజకవర్గ యూత్ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు బోయ రవికుమార్, యాట సుధాకర్, బాల నరసింహులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.