calender_icon.png 19 June, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముల్కనూరు సహకార బ్యాంకు ఎన్నికలు ఏకగ్రీవం

19-06-2025 12:09:27 AM

భీమదేవరపల్లి, మే 18 (విజయక్రాంతి): సహకార రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న ముల్కనూరు సహకార బ్యాంక్ ఎన్నికలు ఏకగ్రీవమైనట్టు జిల్లా సహకార ఎన్నికల అధికారి కే కోదండరాములు ప్రకటించారు. బుధవారం సాయంత్రం సహకార బ్యాంకులో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 16న సహకార బ్యాంకు ఐదు నియోజకవర్గాలకు పది మంది నామినేషన్ వేసినట్టు తెలిపారు. 17న పరిశీలన, 18న ఉపసంహరణ జరిగిందన్నారు. ఐదు స్థానాలకు కేవలం 5 నామినేషన్లు మాత్రమే ఉండటంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్టు ప్రకటించారు.

ఒకటో నియోజకవర్గం నుంచి ప్రస్తుత బ్యాంకు అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, రెండో నియోజకవర్గం నుంచి బొల్లంపల్లి కుమారస్వామి, ఐదు నుంచి గణవేని శ్రీనివాస్, 9వ నియోజకవర్గం నుంచి గుర్రాల భాస్కర్‌రెడ్డి, 15వ నియోజకవర్గం నుంచి కాశిరెడ్డి వసంత ఏకగ్రీవం అయినట్టు వివరించారు. గెలిచిన డైరెక్టర్లతో ఈ నెల 30న అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక జరుగుతుందని, దీంతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. ఎన్నికల అనంతరం అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ప్యానెల్‌కు చెందిన ఐదుగురు డైరెక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 30న డైరెక్టర్లు బ్యాంక్ అధ్యక్షుడిగా అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని లాంచనంగా ఎన్నుకోనున్నారు.