calender_icon.png 19 June, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన భోజనాన్ని అందించాలి

19-06-2025 12:10:51 AM

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

జగిత్యాల, జూన్ 18 (విజయక్రాంతి): పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. జిల్లాలోని వేములవాడ నియోజకవర్గ పరిధిలోగల మేడిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, రికార్డులు పరిశీలించి పదవ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు.

పాఠ్యాంశ బోధన (ఐఎఫ్టి) ఇంటర్ యాక్ట్ ప్లాంట్ ప్యానల్ ద్వారా విద్యార్థులకు బోధించేటప్పుడు కలెక్టర్ తరగతి గదిలో విద్యార్థులతో కూర్చొని బోధన గమనించారు.పాఠశాల విషయాల గురించి విద్యార్థులు, ఉపాధ్యా యులను అడిగి తెలుసుకున్నారు.వంటగది సామాగ్రి, పప్పు దినుసులు, వంట నూనె తదితర వంట సామాగ్రి నాణ్యత ప్రమాణాలతో ఉండాలని, పిల్లలకు మంచి భోజనం అందించాలని ఆదేశించారు.

పాఠశాల ఆవరణలో నీరు నిలువ ఉండకుండా, ఎప్పటి కప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్ వెంట కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జివాకర్ రెడ్డి, డిఈఓ రాము, తహసిల్దార్, సంబంధిత అధికారులున్నారు.