18-10-2025 12:39:17 AM
టేకులబస్తిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఇండ్లు లేని నిరుపేదలకే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ 15వ వార్డు టేకులబస్తీ ఇందిరమ్మ కమిటీ ఇంచార్జీ కన్నూరి వెంకటేష్ తెలిపారు. శుక్రవారం వార్డు లో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేదలను గుర్తించి 19 మందికి ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నుండి మంజూరు చేయించారన్నారు.మిగతా అర్హులకు రెండోవిడత లో ఇళ్ళు మంజూరవుతాయన్నారు.