06-09-2025 12:00:00 AM
బాన్సువాడ, సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ లోని ఈయమ్ఈ 108, 102, 1962 అంబులెన్స్ వాహనాలను శుక్రవారం కామారెడ్డి జిల్లా మేనేజర్ తిరుపతి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. అన్ని అంబులెన్సుల యందు పరికరాలను తనిఖీ చేసారు. ఉద్యోగులకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ప్రసాద్, శివకుమార్, పుందరికం, రాజు, కమలాకర్, రమేష్, సుభాష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.