20-12-2025 05:32:34 PM
నిర్మల్,(విజయ క్రాంతి): ఈ నెల 22 సోమవారం, జిల్లాలో నిర్వహించబోయే విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ ఏర్పాట్లను పలువురు అధికారులు పరిశీలించారు. మిషన్ భగీరథ ఈ ఈ సందీప్ తో పాటు జిల్లా అధికారులు జిఎన్ఆర్ కాలనీలో ఎక్సర్సైజ్ నిర్వహించే ప్రదేశాన్ని ప్రత్యేకంగా పరిశీలించి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం జిఎన్ఆర్ కాలనీతో పాటు, జిల్లా వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించబడనుందని వెల్లడించారు.