15 April, 2026 | 12:08 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

రోడ్డుపై చెత్త వేసిన దుకాణ యజమానులకు రూ.2500 జరిమానా

20-12-2025 05:29 PM

కరీంనగర్,(విజయక్రాంతి): రోడ్డుపై చెత్త చేసిన దుకాణ యజమానులకు మున్సిపల్ అధికారులు 2500 రూపాయల జరిమానా విధించారు. శనివారం డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, శానిటరీ సూపర్వైజర్ శ్యామ్ రాజ్, శానిటరీ  ఇన్స్పెక్టర్ గట్టు శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ స్వామిలతో నగరంలోని ఇందిరా చౌక్ లో తనిఖీలు నిర్వహించారు. ఎస్వీ టిఫిన్స్, ఏఆర్ పాన్ షాప్, ఏఆర్ బిర్యాని సెంటర్ చెత్త రోడ్డుపై వేయగా వారికి  రూ.2,500 జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో జవాన్లు, కార్మికులు  పాల్గొన్నారు.