13 May, 2026 | 1:00 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

అనారోగ్యంతో కామారెడ్డి మాజీ ఎంపీపీ మృతి

26-07-2025 11:35 AM
  1. నివాళులు అర్పించిన మాజీ ప్రభుత్వ విప్ 
  2. కామారెడ్డి లో నిర్వహించిన అంత్యక్రియలు 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి తాజా మాజీ ఎంపీపీ(Former Kamareddy MPP dies) పిప్పిరి ఆంజనేయులు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అనుచరుడు పిప్పిరి ఆంజనేయులు మృతి చెందడం పట్ల గంప గోవర్ధన్ శనివారం ఉదయం పిప్పిరి ఆంజనేయులు ఇంటికి వెళ్లి  పార్థివ శవ వేటికపై పుష్పగుచ్చం పెట్టి నివాళులర్పించారు. అనంతరం కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎం.కె ముజీబుద్దిన్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు బాలరాజు, జూ కంటి మోహన్ రెడ్డి, టేక్ రియల్ బలవంతరావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్  పిప్పిరి సుష్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకట్, పాత హనుమాన్లు, మండల బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.