కార్గిల్ అమర సైనికులకు తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళులు
హైదరాబాద్: భారత సాయుధ దళాల ధైర్య, పరాక్రమాలకు ప్రతీకగా జరుపుకునే కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అమర జవానుల త్యాగాలను స్మరించుకున్నారు. వీర సైనికుల త్యాగం, వారు ప్రదర్శించిన శౌర్యం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు ముఖ్యమంత్రి నివాళులర్పించారు. కార్గిల్ విజయ్ దివస్(Kargil Vijay Diwas) నాడు, మన దేశాన్ని రక్షించడానికి అసమాన ధైర్యంతో పోరాడి అంతిమ త్యాగం చేసిన ధైర్య సైనికులను మనం గుర్తుచేసుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) అన్నారు.
గడ్డకట్టే శిఖరాలపై వారి విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తూనే ఉన్న నిజమైన వీరత్వానికి నిదర్శనం అన్నారు. సైనికుల ధైర్యానికి నేను వందనం చేస్తూ.. వారి వారసత్వాన్ని గౌరవిస్తున్నానని చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. జూలై 26న, భారతదేశం కార్గిల్ విజయ్ దివస్ 26వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది 1999 కార్గిల్ యుద్ధంలో భారత సాయుధ దళాల వీరోచిత ప్రయత్నాలను గుర్తుచేసుకోవడానికి అంకితం చేయబడిన రోజు. జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోని ప్రమాదకరమైన భూభాగంలో జరిగిన ఈ వివాదం భారతదేశానికి నిర్ణయాత్మక విజయంతో ముగిసింది. ఈ రోజు, దేశవ్యాప్తంగా వేడుకలు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిన సైనికుల ధైర్యం, త్యాగాన్ని గౌరవిస్తాయి.






