31-05-2025 12:52:33 AM
గోపాలపేట మే30: గోపాలపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలను నిర్వహించారు. మండల కేంద్రం లో ఉన్న రైతు ఆగ్రో సేవా కేంద్రం, లక్మీ నరసింహ , శ్రీ సాయి ఫెర్టిలైజర్స్ మరియు వాసవి ఫెర్టిలైజర్ లో మం డ ల వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో తనిఖీ చేయడం జరిగింది.
డీలర్స్ అందరూ కూడా లైసెన్స్ మరియు విత్తన రిజిస్టర్ మెయిం టేన్ చేయాలి అని సూచించడం జరిగింది. ధరల పట్టిక ను ప్రదర్శించాలి . రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అమ్మాలి అని చెప్పడం జరిగింది రైతులకు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రసీదులు ఖచ్చితం గా ఇవ్వాలని సూచించడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ మరియు ఎస్ఐ నరేష్ ,ఎస్ఐ నరేష్ తనిఖీ చేయడం జరిగింది.