నిర్మల్లో ఇంటర్ మూల్యాంకనం కేంద్రం ప్రారంభం
27-02-2026 06:49 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్ మూల్యంకనం కేంద్రాన్ని ప్రభుత్వ బాలుర మాధ్యమిక కళాశాలలో శుక్రవారం జిల్లా అధికారి పరశురాం నాయక్ ప్రారంభించారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడి ఇంటర్మీడియట్ సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని నిర్మల్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో CCO సుదర్శన్ గారు, ACO General-I తుకారాం గారు, మరియు అధ్యాపకులు విజయ లక్ష్మి, నవీన్ కుమార్, గౌతమ్, రామారావు, మురళి, ఓం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.




