22-06-2025 12:00:00 AM
ప్రపంచ దేశాల మధ్య శాంతి సామరస్యాలు వర్ధిల్లాలని, క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని చాటిచెప్పేందుకు 1947లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ఏటా జూన్ 23న ప్రపంచ దేశాల ప్రజలు ఒలింపిక్ డే నిర్వహించాలని నిర్ణయించింది. నిర్వహణకు ఐఓసీ జూన్ 23వ తేదీనే ఎందుకు ఎంచుకున్నదంటే 1894 జూన్ 23న పారిస్లోని సోర్బన్లో ఐఓసీ స్థాపన జరిగింది. కమిటీ 42వ వార్షిక సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. అందుకు ప్రతీకగా యేటా ఆ రోజు ఒలింపిక్ డే నిర్వహించాలనే సంకల్పం జరిగింది.