01-06-2025 12:15:46 AM
మాజీమంత్రి హరీశ్రావు
సిద్దిపేట, మే 31: ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు హాజరై, తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్కు చెందిన తాడెం సారయ్య, బండోజు గణేశ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కుటుంబ పెద్దల మృతితో సర్వస్వాన్ని కోల్పోయిన ఆ కుటుంబాలను పార్టీ అక్కున చేర్చుకుంది.
మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ శనివారం మృతుల కుటుంబాలను పరామర్శించారు. పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ‘ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దలను కోల్పోవడం బాధాకరం. వారి మృతి ఆ కుటుం బాలకు తీరనిలోటు. ఈ కష్ట సమయంలో బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
ఏ ఆపద వచ్చినా పార్టీ మీ వెంటే ఉంటుంది’ అని భరోసానిచ్చారు. అనంతరం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ మాట్లాడుతూ, ‘ఈ దురదృష్టకర సంఘటన మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. కుటుంబానికి ప్రధాన ఆధారమైన వ్యక్తులను కోల్పోవడం వల్ల కలిగే బాధ వర్ణనాతీతం. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తోంది.
ఈ చిన్న సహాయం మీ దుఃఖా న్ని తగ్గించలేకపోయినా, పార్టీ మీతో ఉందని, మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని తెలియజేస్తుంది’ అని పేర్కొన్నారు. పార్టీ అగ్ర నాయకత్వం నుంచి అందిన ఈ సహాయం, బాధిత కుటుంబాలకు కొంతైనా ఊరటనిస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.