01-05-2025 12:00:00 AM
పహల్గాంలో ముష్కరుల ఉగ్రదాడి అతికిరాతకమైంది. మతం ఏదో కనుక్కుని చంపటాన్ని చూస్తే దీనిని మతహింసగా చెప్పవచ్చు. ఇస్లామిక్ తీవ్రవాదం దృష్టిలో 22/4 జిహాద్ మృత్యుక్రీడ. ఈ మధ్యకాలంలో ప్రజలపై పెద్దగా ఉగ్రదాడులు జరగలేదు. దాదాపుగా భారత ఆర్మీనే లక్ష్యంగా ఉండేది.
దేశంలోని ప్రజలలో అలజడి సృష్టించటానికి ఈ పన్నాగం పన్నినట్లుగా కనిపిస్తున్నది. దేశ సరిహద్దు ప్రాంతాలు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటాయి. ముష్కరుల సమూల ఏరివేత పూర్తయ్యే వరకు భారత ఆర్మీ విశ్రమించరాదు.
కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్