21 August, 2026 | 10:08 PM

Breaking News

కొత్తగూడెంల జీజీహెచ్ త్వరలో క్యాథ్ ల్యాబ్ సేవలు: ఎమ్మెల్యే కూనంనేని   •   కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు పాటుపడడం అభినందనీయం   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి   •   నేరాల పెరుగుదలను అరికట్టాలి   •   గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •  

సిపిఎస్ వెంటనే రద్దు చేయాలి

01-09-2025 11:02 PM

ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్

వడ్డేపల్లి,(విజయక్రాంతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) ను వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలని హనుమకొండ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తొలుత అంబేద్కర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ ఆకుల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానం వల్ల గత 20 ఏళ్లుగా ఉద్యోగులు ఎంతో నష్టపోతున్నారని అన్నారు.