calender_icon.png 22 June, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాతృత్వాన్ని చాటుకున్న జగ్గారెడ్డి

23-04-2025 01:45:51 AM

*క్యాన్సర్ బాధితురాలికి  రూ.10 లక్షల ఆర్థిక సాయం

సదాశివపేట, ఏప్రిల్ 22:క్యాన్సర్తో బాధపడుతున్న ఓ మహిళ దయనీయ స్థితికి చలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందని తెలుసుకొని ఆమె ఇంటికి మంగళవారం వెళ్లి పరామర్శించారు.

చికిత్స కోసం ఇప్పటి వరకు రూ.7 లక్షల అప్పులు చేశానని బాధితురాలు బోరున విలపించింది. భర్త చనిపోయాడని, ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని వాపోయింది. ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, పిల్లల కోసం బతుకుతున్నానని చెప్పడంతో జగ్గారెడ్డి తీవ్రంగా చలించిపోయారు. వెంటనే రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని తెలిపారు.

తనకు సాయం చేసి, వీడియోలు, ఫోటోలు తీయించుకునే అలవాటు లేదన్నారు. కానీ ఈ సమస్య పది మంది దృష్టికి రావాలని మీడియా దృష్టి కి తీసుకు వచ్చానన్నారు. పేదలకు ఇలాంటి రోగాలు వస్తే కనీసం చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలందరూ ముందుకు రావాలన్నారు. క్యాన్సర్ బాధితులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు, ట్రీట్ మెంట్ కోసం నిరుపేద క్యాన్సర్ బాధితులు పడుతున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని జగ్గారెడ్డి చెప్పారు.