25-08-2025 12:00:00 AM
కొమురవెల్లి, ఆగస్టు 24: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి అన్నపూర్ణ, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ లు వారికి వేద ఆశీర్వచనములు లిచ్చి, ప్రసాదంతో పాటు, శేష వస్త్రాలను అందించారు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, స్థానిక ఎస్సు రాజు ఉన్నారు.