25-08-2025 10:26:18 AM
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ సైబర్ క్రైమ్(Cyber Crime ) బయటపడింది. 12 మంది యువకులు, నెట్ సెంటర్ నిర్వాహకుడిని టేకులపల్లి పోలీసులు(Tekulapally Police) అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరాల ద్వారా దాదాపు రూ. 8 కోట్లు కాజేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరి ఖాతాల్లో రూ. కోటికి పైగా నగదు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.