18-11-2025 05:10:04 PM
బిజెపి నాయకులు, ప్రముఖ శాస్త్రవేత్త డా. పైడి ఎల్లారెడ్డి
వారం రోజులపాటు జపాన్ లో పర్యటన
కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ఈ హబ్ సెంటర్ ను జపాన్ బృందం సందర్శించాలని కోరినట్లు ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి తెలిపారు. వారం రోజులపాటు జపాన్ దేశంలో పర్యటించినట్లు తెలిపారు. తెలంగాణలో ఐటీ, టెక్నాలజీ వంటి రంగాలలో పెద్ద ఎత్తున సహకారం ఉంటుందని తెలిపారు. ప్రపంచ మార్కెట్లో భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున దిగ్గజ కంపెనీలు యోచిస్తున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనుకూలంగా ఉన్నట్లు జపాన్ బృందానికి వివరించినట్లు పైడి ఎల్లారెడ్డి తెలిపారు.
పెట్టుబడులు పెట్టడం వల్ల భారత్, జపాన్ ప్రాంతాల మధ్య శాస్త్ర సాంకేతిక శ్రామిక శక్తి మార్పిడితో అటు జపాన్, భారత సంబంధాలు మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఐ చికెన్ లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టయోటా మోటార్ కంపెనీ కేంద్ర కార్యాలయానికి ప్రధాన నిలయం అని అన్నారు. జపాన్ దేశంలో అత్యంత ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఇదే కి ఓముర మాట్లాడుతూ వారి ప్రాంతంలో డాక్టర్ పైడి ఎల్లారెడ్డి వారి ప్రాంతంలో చేస్తున్న విశేష సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని కొనియాడారు. అనంతరం పైడి ఎల్లారెడ్డి మీ అసెంబ్లీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టి గౌరవింఛీనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆతు చూసి సవాడ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డివిజన్, అతి సూచి సవాడ, ఫర్ఫెక్ట్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ జపాన్ ఆ ఈచి, కరో కవసీమ చైర్పర్సన్ ఐ చీఫ్ ఫర్ఫెక్ట్ వల్, జపాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల సమావేశంలో భాగంగా.. పాల్గొని తెలంగాణ రాష్ట్ర నుంచి సఫల ఆర్గానిక్ కంపెనీ సీఈఓ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి పాల్గొని భారత్లో ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్రంలో పెట్టుబడులకున్న అపార అవకాశాలని సవివరంగా వివరించారు.. అనంతరం డాక్టర్ ఎల్లారెడ్డి అయిచిన్ ప్రేచ్చర్ గవర్నర్ హిదెకీ ఒమురా ను తెలంగాణా ప్రభుత్వం తరపున రాష్ట్రంలో పర్యటించాలని ప్రభుత్వ ఆహ్వాన లేఖ అందజేయగా. దీనికీ అయన సానుకూలగా స్పందించారు.
అనంతరం ఎల్లారెడ్డి తన బృందంతో జపాన్లోని నగోయ రాష్ట్రంలో స్టార్ట్ ప్ సెంటర్ని సందర్శించి వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని టీ హబ్ సెంటర్ ని కూడా జపాన్ బృందం సందర్శించాలని ముఖ్యంగా ఐటీ, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో పెద్ద ఎత్తున పూర్తి సహకారం ఉంటుందని ప్రపంచ మార్కెట్ భారత్లో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున దిగ్గజ కంపెనీలు యోచిస్తూన్నాయని...పెట్టుబడులు పెట్టడం వల్ల భారత్ జపాన్ ప్రాంతాల మధ్య శాస్త్ర సాంకేతిక మరియు శ్రామిక శక్తి మార్పిడితో.. అటు జపాన్, భారత్ సంబంధాలు.. మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
అయిచికెన్ లో ప్రపంచ ప్రసిది గాంచిన టాయోట మోటార్ కంపెనీస్ కేంద్ర కార్యాలయానికి ప్రధాన నిలయం మరియు జపాన్ దేశంలొ అత్యంత ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఈ సందర్బంగా హిదెకీ ఒమురా గారు మాట్లాడుతూ...వారి ప్రాంతంలో డాక్టర్ డా. పైడి ఎల్లారెడ్డి వారి ప్రాంతంలో చేస్తున్న విశేష సేవాకార్యక్రమాలను ఎందరికో స్పూర్తినిస్తుందనీ కొనియాడారు. అనంతరం గౌరవార్థం డా. పైడి ఎల్లారెడ్డి గారిని అసెంబ్లీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించారు.