24-12-2025 03:46:06 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతిస్తున్నట్టు పెన్షన్ సంఘం జాతీయ కార్యదర్శి జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న అన్నారు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట పెన్షనర్లు చేపట్టిన ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు అంతకుముందు పిఆర్టియు జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు టి యు టి ఎఫ్ ఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళీ మనోహర్ రెడ్డి జిల్లా నాయకులు రవి కిరణ్ ముత్యం ముత్తన్న తదితరులు సంఘీభావం తెలిపారు పిఆర్టియు అర్బన్ అధ్యక్షులు బల్స గజ్జరం పాత్రికేయులకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు