15 April, 2026 | 12:07 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

కుష్టు రహిత సమాజమే ధ్యేయం...

24-12-2025 03:42 PM

డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వామన్ రావ్..

బోథ్,(విజయక్రాంతి): కుష్టు వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించాలనే ధ్యేయంతో ఆశా కార్యకర్తలచే ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ వామన్ రావు అన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో భాగంగా ఈనెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న సర్వేను బుధవారం బోథ్ మండలంలోని బోథ్, పొచ్చర గ్రామాలతో పాటు సోనాల మండల కేంద్రంలో ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న ఇంటింటా సర్వేను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా వామన్ రావు మాట్లాడుతూ... శరీరంపై పాలిపోయిన, రాగి రంగుగల మొద్దు బారిన మచ్చలు, కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు ఎవరికైనా ఉన్నట్లయితే తమ ఇంటికి వచ్చే ఆశా కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి చూపించుకోవాలని కోరారు. ఎండిటితో కుష్టు వ్యాధి పూర్తిగా నయమవుతుందని, అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ మందులు ఉచితంగా లభిస్తాయని తెలిపారు.

ప్రాథమిక దశలో గుర్తిస్తే ఎలాంటి అంగవైకల్యం కలగదని పేర్కొన్నారు. 2027 సంవత్సరం వరకు భారతదేశాన్ని కుష్టు రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరం అన్నారు. ఆశా కార్యకర్తలు సైతం సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి.పి.ఎం.ఓ. రమేష్, ఆరోగ్య కార్యకర్తలు లింగారెడ్డి, గోవర్ధన్, జమున, స్నేహ, ఆశా కార్యకర్తలు అనసూయ, శారద, పుష్ప, కవిత,పులాబాయి పాల్గొన్నారు.