23-07-2025 12:00:00 AM
దాశరథికి కేసీఆర్ నివాళి
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): పీడితుల పక్షాన నిలిచిన కలం దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. దాశరథి శత జయంతి సందర్భంగా ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకు న్నారు. కవిగా, రచయితగా, తెలంగాణ అస్మితను, తన ప్రాంత ప్రజల కష్టాలను, ప్రపం చానికి వినిపించిన తెలంగాణ గర్వించదగ్గ భూమి పుత్రుడు దాశరథి అని కొనియా డా రు. జైలు గోడల నడుమ నిర్భంధంలోనూ తెలంగాణ నినాదాన్ని వినిపించిన దాశరథి స్ఫూర్తిని కొనసాగించడం ద్వారా మాత్రమే మనమందించే ఘన నివాళి అన్నారు.