15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కల్వల మోడల్ స్కూల్ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి

21-11-2025 04:46 PM

అదనపు కలెక్టర్ కు ఎస్ఎఫ్ఐ నేతల విజ్ఞప్తి

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లో సమస్యల పరిష్కారం కోసం మూడు రోజులుగా నిరసన చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని, వెంటనే హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ కు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గందసిరి‌ జ్యోతి బసు, పట్ల మధు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హాస్టల్  నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని, వంట వండి పెట్టడం లేదని, విద్యార్థులే శుక్రవారం టిఫిన్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అదనపు కలెక్టర్ కు వివరించారు.

విద్యార్థులు మూడు రోజులుగా ధర్నా చేస్తున్నా సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించని ఎస్.ఓ, వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బానోత్ సింహాద్రి, పట్టణ కార్యదర్శి భాషిపాక పవన్, పట్టణ నాయకులు నవీన్, తాజ్, సన్నీ, జస్వంత్ పాల్గొన్నారు.