25-10-2025 12:00:00 AM
కొండాపూర్, అక్టోబర్ 24: సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు కొండాపూర్ తహసిల్దార్ అశోక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి చౌరస్తా పోతిరెడ్డిపల్లి పిఎస్ఆర్ గార్డెన్లో ఈనెల 25న ఉదయం 10 గంటలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, శాసనసభ్యులు చింతా ప్రభాకర్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కూడా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. చెక్కులు తీసుకునేందుకు లబ్ధిదారులు ఉదయం 10 గంటలకు తప్పకుండా హాజరు కావాలని ఆయన సూచించారు.