29-11-2025 12:00:00 AM
తాడ్వాయి, నవంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలోని శబరి మాత ఆలయంలో శుక్రవారం తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత, తాడ్వాయి మం డలం కేంద్రంలో కొలువైన సద్గురు శబరిమాతాజీ ఆశ్రమాన్ని సందర్శించారు, మా తాజీ ని దర్శించుకున్నారు. ఆశ్రమ ప్రతినిధులు, వేద పండితులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాతాజీ కి పూజలు నిర్వహించి, పండ్లు, పూల మాల, చీర సమర్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి సంఘం అధ్యక్షుడు సంపత్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.