పార్టీ నాయకులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
పటాన్చెరు, ఏప్రిల్ 30(విజయక్రాంతి): మే 8న ఇస్నాపూర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో చేయనున్న సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధుల ను కలుస్తున్నారు. కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తు న్నారు. మంగళవారం పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం, పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, ఐనోలు, రామేశ్వరంబండ, బచ్చుగూడెం, పోచారం గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డికి మద్ధతుగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, పట్టణం, డివిజన్ల పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్ది కాలంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని 9వేల కోట్లతో అభివృద్ధి చేశామని, ఓటు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్కు ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ మం డల అధ్యక్షుడు పాండు, సీనియర్ నాయకు లు దశరథ్రెడ్డి, వెంకట్రెడ్డి, అంతిరెడ్డి, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.