12 May, 2026 | 11:15 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

బాలుడి ప్రాణాలు నిలిపిన కిమ్స్

29-08-2024 01:28 AM
  1. ఛత్తీస్‌గఢ్ నుంచి విమానంలో.. 
  2. రికెట్షియల్ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన 12 ఏండ్ల బాలుడికి సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు చికిత్సచేసి ప్రాణాలు కాపాడారు. సొంత తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన బాలుడిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బాలుడికి రికెట్షియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది రాయ్‌పూర్ ప్రాంతంలో చాలా అరుదు. మెదడులో మెర్స్ అనే సమస్య వచ్చింది. తర్వాత కాలే యం, మూత్రపిండాల సమస్యలు కూడా వచ్చాయి.

చికిత్స అనంతరం బాలుడు తొమ్మిదో రోజుకు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో డిశ్చార్జి చేశాం’ అని కిమ్స్ కడల్స్ పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిపతి డాక్టర్ పరాగ్ శంకర్‌రావు డెకాటే ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని ఏ ప్రాంతంలో ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రోగులకైనా చికిత్స అందించగల సామర్థ్యం కిమ్స్ కడల్స్ హాస్పిటల్‌కు ఉందని డాక్టర్ అవినాష్, డాక్టర్ కళ్యాణ్ చెప్పారు. ఎయిర్ అంబులెన్స్ కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే గానీ, ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదని పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలు లేని నగరాల నుంచి అవి ఉన్నచోటుకు సరైన సమయానికి సమర్థమైన చికిత్స కోసం తీసుకురావడం కీలకమని తెలిపారు.