20 March, 2026 | 6:10 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

అభివృద్ధితో ఇందిరమ్మ రాజ్యం : ఎమ్మెల్యే డా.రాజేష్ రెడ్డి

06-10-2024 05:23 PM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి) : నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడంతో పాటు మహిళలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధితో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తామని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. ఆదివారం మునిసిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించి చెన్నకేశవ స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం హైమాక్స్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు.