06-01-2026 03:00:56 PM
నంగునూరు,(విజయక్రాంతి): నంగునూరు మండల పరిధిలోని గట్లమల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బానోతు ఈశ్వరి జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల మనోహరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఈశ్వరి, ఈ నెల 9 నుండి 12 వరకు హర్యానాలో జరిగే సబ్ జూనియర్ జాతీయ పోటీల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా విద్యార్థినిని,శిక్షణ ఇచ్చిన పీఈటీ రాజ్కుమార్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రమేష్, సర్పంచ్ ఇంగ నరేష్, ఎస్ఎంసీ చైర్మన్,ఉపాధ్యాయ బృందం తదితరులు అభినందించారు.