07-01-2026 09:43:08 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా అగ్రహారంలోని జేఎన్టీయూ కళాశాల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు కలిశారు. ఈ సందర్భంగా వారు కళాశాలలోని పలు సమస్యల గురించి ప్రభుత్వ విప్ కు వివరించారు. త్వరలోనే కళాశాలను సందర్శిస్తానని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ తెలిపారు.