08-06-2025 10:44:02 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి (BRS) సీనియర్ నాయకుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం పార్టీని, దాని సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణ వార్త తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు.
ఆసుపత్రిలో గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఆయన నివాసంలోని ఎమ్మెల్యే మాగంటి భౌతికకాయానికి కేసీఆర్, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నల్గొండ, ఖమ్మం జిల్లాల కేటీఆర్ పర్యటన రద్దు చేసుకున్నారు.