16 వార్డుల్లో లోపించిన పరిశుభ్రత
తూప్రాన్, జూన్ 23: తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొన్నది. బి ఆర్ ఎస్ నాలుగో వార్డ్ కౌన్సిలర్ జైపాల్ రాథోడ్ గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను మన హయాంలో చేయకూడదని, మున్సిపల్ లోని ప్రజలు మనల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించారని ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ప్రజలకు కావలసిన పద్ధతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
ఏ వీధిలో చూసిన డ్రైనేజీ అద్వానంగా తయారైందని, కొన్ని ప్రాంతాలలో మంచినీటి ఎద్దడి ఏర్పడుతుందని ఇప్పటివరకు ఏ వార్డులో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టలేదని నిలదీశారు. గద్ద ప్రభుత్వ హాయంలో అవలంబించిన బిల్లుల పద్ధతిని పునారావృతం కాకుండా చూసుకోవాలని 4వ వార్డు కౌన్సిలర్ జైపాల్ రాథోడ్ మున్సిపల్ సమావేశంలో నిగ్గు తేల్చారు. ప్రతి వార్డుల్లో పారిశుభ్రత పనులను చేపట్టాలని వార్డుకు కావలసిన వనరులను అన్నారు. అనంతరం సమావేశం నుండి వాకౌట్ చేశారు.






