29-05-2025 12:07:25 AM
- అధికారులను వేడుకున్న రైతులు
చింతల మానేపల్లి, మే 28 (విజయ క్రాం తి): ఏళ్లుగా భూములను నమ్ముకొని బతుకుతున్నామని వాటిని లాక్కొని మా పొట్ట కొట్టవద్దని పోడు రైతులు అటవీశాఖ అధికారులను వేడుకున్నారు.
బుధవారం చింతల మానపల్లి మండలం దిందా బండపల్లి శివారులో ఎఫ్డిఓ సుశాంత్ సిబ్బందితో కలిసి పోడు భూముల హద్దులు తవ్వడానికి జెసిబి తో రావడంతో రైతులు అడ్డుకున్నారు. దీం తో ఎఫ్డిఓ రైతులతో చర్చించారు. 40, 50 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉన్న రైతులు భూమిని ప్లాంటేషన్కు వదిలి పెట్టాలని కోరారు.
9 ఎకరాల లోపు ఉన్న భూముల ను తీసుకోమని తెలిపారు. అయినప్పటికీ రైతులు ఒప్పుకోకుండా జెసిబి ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లా డుతూ 40 ఏండ్లుగా సాగుచేసుకుంటు న్నాం.. మాప్రాణాలైనా ఇస్తాం కానీ భూములను మాత్రం వదులుకోమని స్పష్టం చేశా రు. హద్దులు పెట్టేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులలో ఎఫ్ఆర్వో ఇక్బాల్,ఎఫ్ ఎస్ ఓ లు సూర్యనారాయణ, మోహన్, ఎఫ్బిఓ నవ్య తదితరులు పాల్గొన్నారు.