29-05-2025 12:05:45 AM
బెల్లంపల్లి అర్బన్, మే 28 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన కాంపల్లి రాజంను మాదిగ హక్కుల దండోరా (ఎం హెచ్డీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించా రు.
ఈ మేరకు ఆయన నియామకాన్ని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ అన్న మాదిగ ప్రకటించారు. నియామక కాపీని ఎంహెచ్డీ అధ్యక్షుడు సునీల్ మాదిగ చేతుల మీదుగా కాంపల్లి రాజం మాదిగ అందుకున్నారు.
బెల్లంపల్లి తొలి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కాంపెల్లి రాజం మాదిగను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడం పట్ల పలువురు ఎంహెచ్డీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కాంపల్లి రాజంమాదిగ ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ దృక్పథంతో మాదిగ హక్కుల కోసం నిరంతరం పోరాడతానని వెల్లడించారు.