30-05-2025 12:00:00 AM
-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, మే 29 (విజయక్రాంతి) : జిల్లాలో భూముల లే-అవుట్ల కొరకు అందిన దరఖాస్తులను సంబంధిత భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలకు లోబడి అనుమతించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
గురువారం నస్పూర్ మండల కేంద్రంలో లే-అవుట్ కు దరఖాస్తు చేసుకున్న సంబంధిత భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూముల అభివృద్ధి, ఇండ్ల నిర్మాణం, వెంచర్ల ఏర్పాటులో భాగంగా లే-అవుట్ కొరకు అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి లో నిశితంగా పరిశీలించి నియమ, నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేయాలని తెలిపారు.
లే-అవుట్ దరఖాస్తు సంబంధిత భూమి నిషేధిత జాబితా, ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్ పరిధిలో ఉన్నది.. లేనిది.. నిర్ధారిం-చుకోవాలని, లే-అవుట్ సమీపంలో చెరువులు, వాగులు ఇతర ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిం-చాలని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూములు రక్షణ దిశగా చర్యలు తీసుకోవాలని, ఆక్ర-మిత ప్రభుత్వ భూములను చట్టం ప్రకారం sచర్యలు తీసుకొని స్వాధీనపర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.