30-05-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్ మోతీలాల్
మంచిర్యాల, మే 29 (విజయక్రాంతి) : సింగరేణి కార్మికుల, ప్రజల కోసమే జీవితాంతం పరితపించిన ప్రత్యేక రాష్ట్ర పోరాట యోధుడు మునీర్ అని జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్ పేర్కొన్నారు.
గురు వారం జిల్లా కేంద్రంలోనీ ఐబీ చౌరస్తా లో సింగరేణి రిటైర్డ్ కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన మునీర్ సంస్కరణ సభ, అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. నల్ల నేల ముద్దుబిడ్డ, గని కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం అధికారులతో తలపడి నిలబడిన గొప్ప ధైర్యశాలి మునీర్ అని కొనియాడారు.
సింగరేణి సకల జనుల సమ్మె విజయవంతం కావడానికి ఎంతో కృషి చేశారని, సింగరేణి కార్మికులు నాయకులు మునీర్ ఆదర్శంగా తీసుకొని సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. నిజాయితీతో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, కార్మికుల, పేదల పక్షాన నిలబడ్డరని తెలిపారు.
పేదల అండ గా నిలబడడమే మునీర్ కు నిజమైన నివాళిగా పేర్కొన్నారు. అనంతరం నాయకులు, కార్మికులు మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డీటీఓ సంతోష్ కుమార్, సింగరేణి రిటైర్డ్ కార్మికులు గూడూరు యాదిరెడ్డి, వెంకట్రాజం, బార్ అసోసియేషన్ నాయకులు సందాని, కర్ర లచ్చన్న, మొహియుద్దీన్, దమ్మల శ్రీనివాస్, జలాలుద్దిన్, తాజ్, రాయమల్లు, రాజేందర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.