calender_icon.png 17 February, 2026 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవునిపల్లిలో న్యాయ అవగాహన కార్యక్రమం

17-02-2026 07:15:52 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి టి. నాగరాణి  మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, దేవునిపల్లి గ్రామంలో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి, పాఠశాలను తనిఖీ చేయడం జరిగింది.  ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులకు అర్థమయ్యే రీతిలో “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” అంశంపై అవగాహన కల్పించారు.

భద్రత కలిగించే స్పర్శ గుడ్ టచ్, భయం లేదా అసౌకర్యాన్ని కలిగించే స్పర్శ బ్యాడ్ టచ్ అని పిల్లలకు వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినట్లయితే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా నమ్మకమైన పెద్దలకు చెప్పాలని సూచించారు. అలాంటి విషయాలను దాచుకోవద్దని, నిజం చెప్పిన పిల్లలను చట్టం రక్షిస్తుందని ఆమె ధైర్యం కల్పించారు. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే ‘కాదు’ అని చెప్పే ధైర్యం మీకు ఉండాలి.

భయపడకండి, మీరు ఒంటరివారు కారు” అని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని, మంచి ప్రవర్తనతో ఉన్నప్పుడే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్య అనేది జీవితాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధమని ఆమె పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కు లేదా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) లీగల్ ఎయిడ్ హెల్ప్‌లైన్ 15100 కు కాల్ చేయవచ్చని తెలిపారు.

తదనంతరం పాఠశాల ప్రాంగణం, మధ్యాహ్న భోజన వివరాలు,  పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించి, అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో  శ్రీమతి స్రవంతి , డీసీపీవో, ఎల్లయ్య, ఎంఈఓ కామారెడ్డి ,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు  స్వర్ణలత ,  సాధన స్వచ్ఛంద సంస్థ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) కామారెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.