మాధవీలతను గెలిపించి స్త్రీశక్తిని చాటుతాం

10-05-2024 01:44:59 AM

ఆలె భాగ్యలక్ష్మి

చార్మినార్, ఏప్రిల్ 9 : హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా మాధవీలతను గెలిపించుకొని స్త్రీశక్తి చాటుతామని గౌలిపుర బీజేపీ కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి అన్నారు. గురువారం పటేల్‌నగర్ బస్తీలో పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మజ్లిస్ పార్టీ హిందువులపై కక్ష్య పెంచుకుని హైదరాబాద్ నగరంలో రజాకార్ల వ్యవస్థను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకునేలా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.

అందరి మంచి కోరుకునే మాధవీలత ధైర్యంతో అసదుద్దీన్ ఒవైసీపై పోటీకి దిగారని, ఆమెకు యావత్ హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారన్నారు. ఈ నెల 13న ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రజాస్యామ్య విలువలను కాపాడే అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, క్రాంతికుమార్, జె.చంద్రశేఖర్, ఎం.వెంకటేష్, ధీరజ్‌లాల్, రేణుక, స్వప్న, సాయికుమార్ పాల్గొన్నారు.