14-06-2025 12:00:00 AM
రాజాపూర్ జాన్ 13: మండలంలోని మల్లేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థుల కు ఉపాధ్యాయులు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సరస్వతి పూజ చేసి అక్షరాభ్యాసం చేశారు.విద్యార్థులు చక్కగా చదువుకొని తమ తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఉపాధ్యాయులు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవి నాయక్, ఉపాధ్యాయులు కళావతి, చంద్రకళ, విద్యార్థులు పాల్గొన్నారు.