calender_icon.png 14 June, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలి

13-06-2025 11:39:28 PM

ములుగు,(విజయక్రాంతి): జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచుతూ మత్స్యకారుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని రాష్ట్ర పంచాయితి రాజ్ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో యుఎస్టి,నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో జీవంతరావుపల్లి గ్రామంలోని ముదిరాజ్ కులానికి చెందిన కుటుంబాలకు 25తెప్పలు చేపలు పట్టే వలలు రాష్ట్ర పంచాయితి రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి  దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... జీవంతరావుపల్లి గ్రామంలో అధికంగా ఉన్న మత్యకారులకు నిర్మాణ్ సంస్థ వారు తెప్పలు వలలు అందించడం చాలా అభినందిందనీయం అని నిర్మాణ్ సంస్థ వారికి అభినందించారు. జీవంతరావు పల్లి గ్రామాన్ని ప్రభుత్వ పథకాల అమలులో పైలట్ ప్రాజెక్టు గ్రామంగా ఎన్నుకుని ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల మంజూరు, ములుగు మున్సిపాలిటీలో కలవడం గ్రామానికి డబుల్ రోడ్డు, సెంటర్ లైటింగ్ తో అభివృధి జరుగుతుందని గ్రామాన్ని మోడల్ గ్రామంగా నిర్మించుకుని అందరూ ఉపాధి అవకాశాలు వినియోగించుకోవాలని అశాభావం వ్యక్తం చేశారు.