07-05-2024 12:05:00 AM
న్యూఢిల్లీ, మే 6: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం వాడివేడిగా సాగుతోంది. ఇవాళ లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని93 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1,351 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. మామూలుగా ఈ విడతలో 94 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా, గుజరాత్లోని సూరత్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు.అలాగే జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ స్థానం మే 25వ తేదీకి వాయిదా పడింది. ఇక, మధ్యప్రదేశ్లోని బెతూల్ స్థానంలో రెండో విడతలో పోలింగ్ జరగాల్సి ఉండగా, అది వాయిదా పడటంతో ఇవాళ ఈ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. గుజరాత్లో ఉన్న 25 స్థానాలకు ఒకేసారి ఇవాళ పోలింగ్ జరగనుంది.