calender_icon.png 4 June, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న కార్చిచ్చు

07-05-2024 12:00:18 AM

3 రోజుల్లో ఐదుగురి మృతి

డెహ్రాడూన్, మే 6: ఉత్తరాఖండ్‌లోని చాలా అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు రగులుతూనే ఉంది. గత మూడు రోజుల్లో జరిగిన ఘటనల్లో 28 ఏళ్ల మహిళ సహా ఐదుగురు మరణించారు. కార్చిచ్చు కారణంగా ఆదికైలాశ్ హెలికాప్టర్ దర్శనాన్ని వరుసగా రెండో రోజు కూడా రద్దు చేశారు. అల్మోరా జిల్లాలోని ప్రముఖ దునాగిరి ఆలయం సమీపంలోకి మంటలు చెలరేగగా.. అక్కడి యాత్రికులను అధికారులు తరలించారు. మానవ కార్యకలాపాల వల్లనే అడవులు తగలబడుతున్నాయని అధికారులు చెబుతు న్నారు. పోడు వ్యవసాయం కోసం గడ్డి భూములను తగలబెట్టడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. గతేడాది నవంబర్ 1 నుంచి ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 910 ఘట నలు జరిగినట్లు చెప్పారు. మొత్తం 1,144 హెక్టార్ల అడవి తగలబడిందని వెల్లడించారు. కార్చిచ్చు వల్ల కుమావున్ డివిజన్ తీవ్రంగా ప్రభావితమైందని, ఇక్కడ 482 ప్రమాదాలు జరిగాయని వివరించారు. ఈ ఘటనలు రాష్ట్రంలో పర్యటకంపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ కార్చిచ్చు గత నెలలో ప్రముఖ పర్యటక కేంద్రమైన నైనిటాల్ వరకు చేరగా భారత వాయుసేన తక్షణం స్పందించి మంటలు ఆర్పివేసింది.