calender_icon.png 31 May, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇజ్రాయెల్ దాడిలో 19 మంది మృతి

07-05-2024 12:05:00 AM

మిత్రదేశాలు వద్దంటున్నా రఫా నగరంపై దాడి

సురక్షిత ప్రాంతాలకు పాలస్తీనియుల తరలింపు

ఇజ్రాయెల్, మే 6: గాజాలోని రఫా నగరంలోని తూర్పు భాగంలో క్షేత్రస్థాయి ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం సుమారు అక్కడ నివసిస్తున్న లక్ష మందిని ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆ దేశం ఆదేశించింది. రఫాపై ఆదివారమే ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించగా 19 మంది ప్రజలు మృత్యువాతపడ్డారని ఓ వార్తాసంస్థ పేర్కొంది. హమాస్ బలంగా పాతుకుపోయిన ప్రాంతాల్లో చివరిది రఫా నగరమే. హమాస్‌ను నామరూపాల్లేకుండా చేయాలనుకుంటున్న ఇజ్రా యెల్.. ప్రపంచదేశాలు వద్దని వారిస్తున్నా రఫాలో ఆపరేషన్‌కు సిద్ధమైం ది. అంతేకాకుండా గాజాలో బలగాలను ఉపసంహరిస్తే సంధికి సిద్ధమని హమాస్ ప్రకటించినా ఇజ్రాయెల్ ఒప్పుకోవటం లేదు. హమాస్ డిమాం డ్లు అంగీకారయోగ్యంగా లేవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు.