15 April, 2026 | 12:07 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

మర్రి మానుపై మమకారం

11-05-2025 01:14 AM
  1. వానకు కూలిన 2౦౦ ఏండ్ల చెట్టు 
  2. అదే స్థానంలో రీప్లాంటేషన్
  3. ఆదర్శం బయ్యారం గ్రామస్థులు

మహబూబాబాద్, మే ౧౦ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామంలో ౨౦౦ఏళ్ల  వయసు ఉన్న మర్రి మానుపై ఆ గ్రామస్థులకు ఎనలేని మమకా రం. చల్లని నీడని ఇవ్వడంతో పాటు గ్రామ దేవత ముత్యాలమ్మ ఆలయం చెంతనే ఉండటంతో చెట్టుపై కూడా భక్తిభావం పెంపొం దింది. అయితే ఈ నెల ఒకటిన అర్ధరాత్రి వీచిన పెనుగాలులకు ఆ మర్రిమాను కూకటి వేళ్లతో కూలిపోయింది. దీంతో గ్రామస్థులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మర్రిమానును తిరిగి నిలబె ట్టాలని తలపోసారు.

గ్రామ పెద్ద, రిటైర్డ్ టీచ ర్ గుండా మధుకర్‌రెడ్డి సారధ్యంలో మర్రిమానును తిరిగి నిలబెట్టేందుకు ముత్యాలమ్మ తల్లి దేవాలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్థులు సమిష్టి కృషిగా నిర్ణయించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చించి వారి సూచన మేరకు మర్రిమానును తిరిగి నిలబెట్టడానికి చర్యలు చేపట్టారు. కొమ్మలను కత్తిరించి, భారీ క్రేను, రెండు జేసీబీల సహాయంతో కూలిన చోటే శనివారం మర్రిమానును నిలబెట్టారు. దీనంతటికీ వారం సమయం పట్టింది. మర్రిమాను పునర్జీవం పోసుకుంటుందనే ఆశాభావంతో గ్రామస్థులు ఉన్నారు.